* సామాజిక న్యాయ మంత్రి థవార్ చంద్
దిల్లీ: ఎస్సీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి మంత్రి థవార్ చంద్ గహ్లోత్ పేర్కొన్నారు. వారికి అందించే ఉపకార వేతనాల విషయంలో చరిత్రాత్మక మార్పు తీసుకొచ్చిందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల ఎస్సీ విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా రూ.59,048 కోట్ల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిర్ణయం విద్యా ప్రమాణాలను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదో తరగతి తర్వాత చదువు ఆపేసిన సుమారు 1.36 కోట్ల ఎస్సీ విద్యార్థులు మళ్లీ ఉన్నత విద్యను కొనసాగించడానికి ఈ పథకం ఉపకరిస్తుందన్నారు. ఉపకారవేతనాల నిధుల్లో తన వాటాను 60 శాతానికి పెంచిన కేంద్రం, త్వరలో దాన్ని 80 శాతం చేస్తుందని గహ్లోత్ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.