ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వందలోపు విద్యార్థులున్న జూనియర్ కళాశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు నిర్వహించాలని ఇంటరు విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు 101-500 మంది ఉంటే రెండు విడతలుగా తరగతులు కొనసాగించాలని, మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక బ్యాచ్, సాయంత్రం ఆరు గంటల వరకు మరో బ్యాచ్కు నిర్వహించాలని సూచించారు. 500 మంది కంటే ఎక్కువ ఉండే కళాశాలల్లో రెండు విడతలతోపాటు ఒక రోజు కొందరికి మరో రోజు మిగతావారికి తరగతులు నిర్వహించాలని వెల్లడించారు. విద్యార్థులు ఇంటివద్ద ఉండే సమయంలో ఆన్లైన్ తరగతులు కొనసాగించాలని ఆదేశించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.