* జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ లేదా సీబీఆర్టీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశముందని, పరీక్ష నిర్వహణ పద్ధతిపై తుది నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందని ఇప్పటికే జారీ అయిన గ్రూప్-1 నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొంది. గ్రూప్-1కు భారీ సంఖ్యలో 4.03 లక్షల దరఖాస్తులు వచ్చినందున సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని భావించింది. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
TSPSC Group-1 Notification
TSPSC Group -1 Prelims Model papers
TSPSC Group-1 previous papers
TSPSC Group -1 prelims study material
మరింత సమాచారం... మీ కోసం!
‣ మెరుగైన కెరియర్కు.. కన్స్యూమర్ లా!
‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్గా..!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.