కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం బ్యాక్లాగ్ పరీక్షలు మే 17 నుంచి కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల సమీపంలోని వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు సమన్వయ అధికారి డా.ఆడెపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ తృతీయ, ప్రథమ సంవత్సరం పరీక్షలు 17 నుంచి.. ద్వితీయ సంవత్సరం పరీక్షలు 31 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు.
Some more information
"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"