ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి కాళోజీ వర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2020 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థులు జనవరి 23 ఉదయం 9 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలని కోరింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.