ఈనాడు, హైదరాబాద్: ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో తొలివిడత సీట్ల భర్తీకి ఫిబ్రవరి 5, 6 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ను నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 04న ఓ ప్రకటనలో తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 05వ తేదీ ఉదయం 8 నుంచి 6వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలంది. వివరాలకు ఆరోగ్య వర్సిటీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలంది.
కొత్తగా 11 పీజీ దంత వైద్య సీట్లు
నిజామాబాద్లోని ‘మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్’లో 2021-22 సంవత్సరానికి కొత్తగా 11 పీజీ దంత వైద్య సీట్లను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంజూరు చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.