పరీక్షల ముందు రెట్టింపు ఉత్సాహంతో, ఏకాగ్రతతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి! ఆ ఆకాంక్షను ఈ పోషకాహారంతో నిజం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందామా?
‣ మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, చురుగ్గా పనిచేయడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎంతో తోడ్పడతాయి. అంతేకాదు జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలను పెంచడానికీ¨, కుంగుబాటును తగ్గించడానికీ సహాయపడతాయి. ఇవి సాల్మన్, ట్యునా చేపలు, అవిసె, చియా గింజలు, గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి.
‣ తృణధాన్యాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. బ్రౌన్రైస్, తృణ ధాన్యాలు, చిరుధాన్యాల్లోని విటమిన్-బి నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు శక్తిని పెంచుతుంది. ఎక్కువ గంటలపాటు చదివినా విద్యార్థులు అలసిపోకుండా ఉండాలంటే వీటిని తీసుకోవడం మంచిది.
‣ జ్ఞాపకశక్తి పెరిగి, ఇనుము, విటమిన్-ఎ, డి, ఇ, బి-12 శరీరానికి అందాలంటే గుడ్డు తినడం మర్చిపోవద్దు. పరీక్షల సమయంలో ఆరోగ్యంగా, బలంగా, చురుగ్గా ఉండాలనుకుంటే ఉడికించిన గుడ్డును తినడం అలవాటు చేసుకోవాలి.
‣ నేర్చుకోవడం, ఆలోచనా సామర్థ్యం, తార్కికంగా ఆలోచించడం, జ్ఞాపకశక్తి, సమస్యా పరిష్కార నైపుణ్యం లాంటి మానసిక సామర్థ్యాలు పెరగాలంటే.. ఎరుపు, ఆరెంజ్, పచ్చ రంగుల్లోని కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి.
‣ వీటితోపాటు కాస్త నీరసంగా అనిపించినప్పుడు డార్క్చాక్లెట్ను నోట్లో వేసుకోవడం మర్చిపోవద్దు. ఇది రక్తపోటును నియంత్రించడమే కాకుండా మెదడుకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది.
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.