* రీకౌంటింగ్, రివాల్యుయేషన్ తేదీల వెల్లడి
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను బోర్డు అధికారులు రిలీజ్ చేశారు. అలాగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యుల్ను కూడా బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ లోగా సప్లిమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించవచ్చును. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. బుధవారం (ఏప్రిల్ 24) సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లో మార్కు షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!