• facebook
  • whatsapp
  • telegram

బీటెక్‌తో సైన్యంలోకి.. 

టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు ప్రకటన విడుదల

బీటెక్‌ విద్యార్హతతో ఆర్మీలో సేవలందించే అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారినీ, చివరి ఏడాది చదువుతున్నవారినీ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ)ల్లోకి ఇండియన్‌ ఆర్మీ ఆహ్వానిస్తోంది. నియామకాలు సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు ఇంటర్వ్యూలతో చేపడతారు. ఎంపికైనవారికి ప్రతి నెలా స్టైపెండ్‌ చెల్లిస్తూ శిక్షణ అందిస్తారు. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. 

ఆర్మీ కెరియర్‌పై ఆసక్తి ఉన్నవారు ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను బీటెక్‌ మార్కుల మెరిట్‌ అనుసరించి వడపోస్తారు. వీరికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) బెంగళూరులో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. వీటిని సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూయింగ్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో చేపడతారు. తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటెలిజెన్స్‌) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారినే స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. వీరికి నాలుగు రోజులపాటు పలు విభాగాల్లో పరీక్షించి, అందులో రాణించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు.

శిక్షణ కాలంలో స్టైపెండ్‌

కోర్సులోకి ఎంపికైనవారికి ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, దేహ్రా దూన్‌లో జనవరి, 2024 నుంచి 49 వారాలపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత రూ.56,100 మూలవేతనంతోపాటు రూ.15,500 మిలిటరీ సర్వీస్‌ పే అందుతాయి. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అందువల్ల తొలి నెల నుంచే సుమారు రూ.లక్షకుపైగా వేతనం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయి హోదాలు సొంతం చేసుకోవచ్చు. రెండేళ్ల సర్వీస్‌తో కెప్టెన్, ఆరేళ్లు కొనసాగితే మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ కావచ్చు. ఇవి పూర్తికాలపు పోస్టులు. అందువల్ల పదవీ విరమణ వయసు వరకు విధుల్లో కొనసాగవచ్చు. అనంతరం పింఛను అందుకోవచ్చు.    

ఖాళీలు: మొత్తం 40. 

ఏ విభాగాల్లో: సివిల్‌ పరిధిలో 11, కంప్యూటర్‌ సైన్స్‌ 9, ఎలక్ట్రికల్‌ అనుబంధ విభాగాలు 4, ఎలక్ట్రానిక్స్‌ అనుబంధ విభాగాలు 6, మెకానికల్‌ 8, ఇతర విభాగాల్లో 2 ఉన్నాయి. 

అర్హత: నిర్దేశిత/ అనుబంధ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అవివాహిత పురుషులే అర్హులు.

వయసు: జనవరి 1, 2024 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే జనవరి 2, 1997; జనవరి 1, 2004 మధ్య జన్మించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: మే 17 మధ్యాహ్నం 3 వరకు. 

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/Authentication.aspx
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో అధికారులుగా అవకాశం

‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో కొలువులు

‣ క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ డిగ్రీ, పీజీతో సిపెట్‌లో ఉద్యోగాలు

‣ బోధనలో రాణించాలని ఉందా?

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌