• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్స్‌ సన్నద్ధత పనికొచ్చింది

మందడి శ్యామ్‌సుందర్‌రెడ్డి, చిల్పంకుంట్ల (నల్గొండ జిల్లా)ి


1. వీఆర్‌ఓ పరీక్షకు ప్రణాళిక అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. దీన్నే లక్ష్యం చేసుకుని చదవలేదు. ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయంలో ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటలవరకూ- మళ్ళీ రాత్రి కాసేపు చదువుతూవచ్చాను. వీఆర్‌ఓ పరీక్ష కోసం నిజానికి ఎక్కువ సమయం చదవలేదనే చెప్పాలి.

2. వీఆర్‌ఓ, పంచాయతీ సెక్రటరీ పరీక్షల్లో జనరల్‌స్టడీస్‌ ఉంది. కాబట్టి దాన్ని చదివాను. పంచాయతీ సెక్రటరీలో మిగిలిన పేపర్‌ తర్వాత చదవొచ్చని జీఎస్‌ మీదే దృష్టిపెట్టాను. గ్రూప్‌-2 స్థాయిలో- అందరూ సాధారణంగా చదివే పుస్తకాలే చదివాను. ప్రత్యేకంగా ఏమీ తయారవలేదు.
3. గ్రామీణ స్థితిగతులపై ఎక్కువ ప్రశ్నలు రాకపోవటం ప్రతికూలతగా ఏమీ అనిపించలేదు. దానికి 30 మార్కులు మాత్రమే కాబట్టి ఆ వెయిటేజీకి ఎంత అవసరమో అంతవరకే చదివాను.
4. గ్రూప్స్‌ సన్నద్ధత అనుభవం ఉపయోగపడింది. ప్రైవేటు కంపెనీలో పనిచేసిన అనుభవం మూలంగా ప్రభుత్వోద్యోగం సంపాదించాలని గట్టిగా అనిపించింది. పరీక్షలో సమయ నిర్వహణ కోసం నమూనా పేపర్లు సాధన చేశాను. గతంతో పోలిస్తే పేపర్‌ సులువుగానే వచ్చింది. పరీక్ష రాయగానే నూరు శాతం మార్కులు వస్తాయనుకోలేదు. 'కీ' చూసుకున్నాక మాత్రం అన్ని మార్కులూ సాధించగలనని నిర్ధారణ అయింది!

Posted Date: 01-11-2019


  • Tags :