- నీట్ - యూజీలో అర్హుల సంఖ్య 47,356కు తగ్గుదల
ఈనాడు, హైదరాబాద్: నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. జూన్ 4న మొదట విడుదల చేసిన ఫలితాల్లో 47,371 మంది అర్హత సాధించగా..జులై 26న ఎన్టీఏ వెల్లడించిన ఫలితాల్లో 47,356 మంది అర్హత పొందారు. అలానే ర్యాంకుల్లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రానికి చెందిన అనురన్ ఘోష్కు గతంలో జాతీయస్థాయిలో 77వ ర్యాంకు రాగా.. ఈ సారి 137వ ర్యాంకు వచ్చింది.గత ఫలితాల్లో గుగులోత్ వెంకటనృపేశ్కు ఎస్టీ కేటగిరిలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు.. సాధారణ ర్యాంకు 167 రాగా.. తాజా ఫలితాల్లో ఎస్టీ కేటగిరిలో మొదటి ర్యాంకు, సాధారణ ర్యాంకు 219 వచ్చింది.
లావుడ్య శ్రీరాంనాయక్కు మొదట వెల్లడించిన ఫలితాల్లో ఎస్టీ కేటగిరిలో జాతీయ స్థాయి రెండో ర్యాంకు, సాధారణ ర్యాంకు 453 రాగా.. ప్రస్తుతం ఎస్టీ కేటగిరిలో నాలుగో ర్యాంకు, సాధారణ ర్యాంకు 553 వచ్చింది.
- Read Latest jobs, Latest notifications and Latest govt jobs
- Follow us on Facebook, Twitter, Share chat, Google News
- Subscribe our Youtube Channel