వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి 57,798 మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. వీరిలో 55,200 మంది పరీక్ష రాయగా 39,039 మంది (70.72%) అర్హత సాధించారు. కిందటేడాది 72.55 మంది అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీతోపాటు ఎస్సీ, ఎస్టీ విభాగాల్లోనూ మంచి ర్యాంకులు సాధించారు. . దేశవ్యాప్తంగా తొలి 20 ర్యాంకుల్లో ఐదుగురు అమ్మాయిలు ఉంటే ఇద్దరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కావడం విశేషం. గుండె వైద్యంపై మక్కువ - శ్రీనందన్రెడ్డి, జాతీయస్థాయిలో 42వ ర్యాంకు మా నాన్న రామిరెడ్డి కడప నీటిపారుదల శాఖలో డీఈఈగా, అమ్మ ప్రసూన ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారిద్దరి ప్రోత్సాహం, సంకల్ప్ విద్యాసంస్థ, వైజాగ్ నారాయణ జూనియర్ కళాశాల అధ్యాపకుల కృషి వల్లనే జాతీయ స్థాయిలో 42వ ర్యాంకు సాధించగలిగా. కార్డియాలజీలో విషయ పరిజ్ఞానం పెంచుకుని మంచి వైద్యసేవలు అందించాలన్నది నా లక్ష్యం. దిల్లీలో ఎంబీబీఎస్ చేస్తా -శ్రీ శ్రేయు, 78వ ర్యాంకు
కార్డియాలజీ నిపుణుడిగా పేరు తెచ్చుకుంటా - పి.దినేష్ లక్ష్మీకుమార్నాయక్, ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు మాది నెల్లూరు. నాన్న బీసీఎస్ నాయక్ విద్యుత్తు శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్. అమ్మ అరుణ. నెల్లూరులో నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాను. చదువుల్లో నాన్నే నాకు స్ఫూర్తి. మంచి కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేయాలన్నది లక్ష్యం.
అమ్మ కల నెరవేరుస్తున్నా - సుమల్య, ఎస్టీ విభాగంలో 33వ ర్యాంకు
అధ్యాపకుల తోడ్పాటు - హర్షిత్ చౌదరి, 64వ ర్యాంకు, నెల్లూరు గుండె వైద్యనిపుణులుగా నిరుపేద ప్రజలకు సేవలందించాలనేది నా కోరిక. నాన్న ప్రవీణ్కుమార్, అమ్మ సునీత ఇద్దరూ వైద్యులే. వారి మాదిరి నేను వైద్యవృత్తిలో స్థిరపడాలనుకున్నాను. నారాయణ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు బోధన ఎంతగానో ఉపయోగపడింది. వారి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా వారు సందేహాలను నివృత్తి చేసేవారు. వందలోపు ర్యాంకు వస్తుందని అనుకోలేదు. మంచి ర్యాంకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
సామాజిక మాధ్యమాలు ఒత్తిడిని తగ్గించాయి - అక్షత్ కౌశిక్, మూడో ర్యాంకర్ రెండేళ్లుగా నీట్కు సన్నద్ధమవుతున్నా. ఈ సమయంలోనూ సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లోనూ చురుగ్గా ఉండేవాడిని. నెటిజన్లు ప్రస్తావించే రకరకాల అంశాలు పలువురిని పలు విధాలుగా దారి మళ్లిస్తుంటాయి. అయితే, సామాజిక వేదికలు నా చదువుల ఒత్తిడిని తగ్గించేవి. నా లక్ష్యానికి అవరోధం కలిగించేవి కాదు. ఎయిమ్స్లో వైద్య విద్యను అభ్యసించాలన్నది నా ఆకాంక్ష. ఒకవేళ ఆ సంస్థలో ప్రవేశం లభించకుంటే దిల్లీలోని మౌలానా ఆజాద్ వైద్యకళాశాలలో చేరుతా. నిరుపేదలకు వైద్యసేవలందిస్తా - 16వ ర్యాంకు, ప్రొద్దుటూరు మా స్వగ్రామం ప్రొద్దుటూరు. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే నాకు మంచి ర్యాంకు దక్కింది. నాన్న జాకీర్ ఖురేషి వ్యాపారం చేస్తుంటారు. అమ్మ రుక్సానా గృహిణి. ఆలిండియాలో 16వ ర్యాంకు సాధించినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ర్యాంకు వస్తుందని అనుకోలేదు. 100 నుంచి 200లోపు వస్తుందని ఆశించాను. నిరుపేదలకు వైద్యం అందించేందుకు కృషి చేస్తా. -ఆశ్ర ఖురేషి,
|
వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి 57,798 మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేశారు. వీరిలో 55,200 మంది పరీక్ష రాయగా 39,039 మంది (70.72%) అర్హత సాధించారు. కిందటేడాది 72.55 మంది అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీతోపాటు ఎస్సీ, ఎస్టీ విభాగాల్లోనూ మంచి ర్యాంకులు సాధించారు. . దేశవ్యాప్తంగా తొలి 20 ర్యాంకుల్లో ఐదుగురు అమ్మాయిలు ఉంటే ఇద్దరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కావడం విశేషం. గుండె వైద్యంపై మక్కువ - శ్రీనందన్రెడ్డి, జాతీయస్థాయిలో 42వ ర్యాంకు మా నాన్న రామిరెడ్డి కడప నీటిపారుదల శాఖలో డీఈఈగా, అమ్మ ప్రసూన ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారిద్దరి ప్రోత్సాహం, సంకల్ప్ విద్యాసంస్థ, వైజాగ్ నారాయణ జూనియర్ కళాశాల అధ్యాపకుల కృషి వల్లనే జాతీయ స్థాయిలో 42వ ర్యాంకు సాధించగలిగా. కార్డియాలజీలో విషయ పరిజ్ఞానం పెంచుకుని మంచి వైద్యసేవలు అందించాలన్నది నా లక్ష్యం. దిల్లీలో ఎంబీబీఎస్ చేస్తా -శ్రీ శ్రేయు, 78వ ర్యాంకు
కార్డియాలజీ నిపుణుడిగా పేరు తెచ్చుకుంటా - పి.దినేష్ లక్ష్మీకుమార్నాయక్, ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు మాది నెల్లూరు. నాన్న బీసీఎస్ నాయక్ విద్యుత్తు శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్. అమ్మ అరుణ. నెల్లూరులో నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాను. చదువుల్లో నాన్నే నాకు స్ఫూర్తి. మంచి కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేయాలన్నది లక్ష్యం.
అమ్మ కల నెరవేరుస్తున్నా - సుమల్య, ఎస్టీ విభాగంలో 33వ ర్యాంకు
అధ్యాపకుల తోడ్పాటు - హర్షిత్ చౌదరి, 64వ ర్యాంకు, నెల్లూరు గుండె వైద్యనిపుణులుగా నిరుపేద ప్రజలకు సేవలందించాలనేది నా కోరిక. నాన్న ప్రవీణ్కుమార్, అమ్మ సునీత ఇద్దరూ వైద్యులే. వారి మాదిరి నేను వైద్యవృత్తిలో స్థిరపడాలనుకున్నాను. నారాయణ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు బోధన ఎంతగానో ఉపయోగపడింది. వారి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఏ చిన్న అనుమానం వచ్చినా వారు సందేహాలను నివృత్తి చేసేవారు. వందలోపు ర్యాంకు వస్తుందని అనుకోలేదు. మంచి ర్యాంకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
సామాజిక మాధ్యమాలు ఒత్తిడిని తగ్గించాయి - అక్షత్ కౌశిక్, మూడో ర్యాంకర్ రెండేళ్లుగా నీట్కు సన్నద్ధమవుతున్నా. ఈ సమయంలోనూ సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లోనూ చురుగ్గా ఉండేవాడిని. నెటిజన్లు ప్రస్తావించే రకరకాల అంశాలు పలువురిని పలు విధాలుగా దారి మళ్లిస్తుంటాయి. అయితే, సామాజిక వేదికలు నా చదువుల ఒత్తిడిని తగ్గించేవి. నా లక్ష్యానికి అవరోధం కలిగించేవి కాదు. ఎయిమ్స్లో వైద్య విద్యను అభ్యసించాలన్నది నా ఆకాంక్ష. ఒకవేళ ఆ సంస్థలో ప్రవేశం లభించకుంటే దిల్లీలోని మౌలానా ఆజాద్ వైద్యకళాశాలలో చేరుతా. నిరుపేదలకు వైద్యసేవలందిస్తా - 16వ ర్యాంకు, ప్రొద్దుటూరు మా స్వగ్రామం ప్రొద్దుటూరు. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే నాకు మంచి ర్యాంకు దక్కింది. నాన్న జాకీర్ ఖురేషి వ్యాపారం చేస్తుంటారు. అమ్మ రుక్సానా గృహిణి. ఆలిండియాలో 16వ ర్యాంకు సాధించినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ర్యాంకు వస్తుందని అనుకోలేదు. 100 నుంచి 200లోపు వస్తుందని ఆశించాను. నిరుపేదలకు వైద్యం అందించేందుకు కృషి చేస్తా. -ఆశ్ర ఖురేషి,
|