• facebook
  • whatsapp
  • telegram

 కేంద్ర బడ్జెట్‌ 2024-25

 * ఏడోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌
 


‣ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న లోక్‌ సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.


9 ప్రధానాంశాల ఆధారంగా బడ్జెట్‌: నిర్మలా సీతారామన్‌


‣  ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి

‣  వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు

‣  వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం


నిరుద్యోగుల కోసం మూడు పథకాలు:


‣  ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు

‣ ఈపీఎఫ్‌ఓలో నమోదు ఆధారంగా వీటి అమలు

‣ సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లింపు

‣  గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు.

‣  210 లక్షల మంది యువతకు లబ్ధి


ప్రజల మద్దతుతో మూడోసారి అధికారంలోకి


‣ ప్రజల మద్దతుతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం

‣ దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది

‣ అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం

‣  మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌

‣  బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు


బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు
 

‣ బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గింపు

‣ ప్లాటినమ్‌పై 6.4 శాతాననికి కుదింపు


క్యాన్సర్‌ రోగులకు ఊరట
 

‣ క్యాన్సర్‌ రోగుల మందులపై సుంకం ఎత్తివేత

‣ మొబైల్‌ ఫోన్లపై బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు


ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం
 

‣  ద్రవ్యలోటు జీడీపీలో 4.9 శాతానికి తగ్గుతుందని అంచనా

‣  మరింత హేతుబద్ధంగా జీఎస్టీ రేట్లు

‣  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలు మరింత సరళతరం


NPSలో మార్పులు
 

‣ ఎన్‌పీఎస్‌ పథకంలో మార్పులు

‣ మైనర్లూ చేరేందుకు అవకాశం

‣ ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధికి పెద్దపీట

‣ కాశీ తరహాలో గయ అభివృద్ధి

‣  బిహార్‌ రాజ్‌గిరి జైన్‌ ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

‣ టూరిజం కేంద్రంగా నలందా అభివృద్ధి


వరద నివారణకు బిహార్‌కు రూ.11వేల కోట్లు
 

‣  వరదల వల్ల బిహార్‌ ఏటా నష్టపోతోంది

‣ వరద నివారణకు, సాగు కార్యక్రమాలకు రూ.11వేల కోట్లు కేటాయింపు

‣ వరద నివారణకు అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్‌కు ప్రత్యేక నిధులు


స్టాంప్‌ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
 

‣ స్టాంప్‌ డ్యూటీని పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి

‣ మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్‌ డ్యూటీ తగ్గింపు

‣ ఒడుదొడుకుల్లో స్టాక్‌ మార్కెట్లు..

‣  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రకటిస్తున్న నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఒడుదొడుకుల్లో చలిస్తున్నాయి. ఉదయం 11:55 గంటలకు సెన్సెక్స్‌ 172 పాయింట్లు నష్టపోయి 80,329 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు కుంగి 24,452 వద్ద ట్రేడవుతోంది.


మౌలిక సదుపాయాలకు ₹11.11 లక్షల కోట్లు


‣ మౌలిక సదుపాయల కల్పనకు బడ్జెట్‌లో మరోసారి పెద్దపీట

‣  బడ్జెట్‌లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు

‣  జీడీపీలో 3.4 శాతానికి సమానం


గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు


‣ గృహ నిర్మాణంపై బడ్జెట్‌లో ప్రకటన

‣  అర్బన్‌ హౌసింగ్‌ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు


కోటి మందికి ఉద్యోగ కల్పన


‣  500 పెద్ద కంపెనీల్లో కోటికి మంది యువతకు ఉద్యోగాల కల్పన

‣ వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు

‣  12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు

‣  పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం

‣  పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం


గ్రామీణ భారతానికి రూ.2.66 లక్షల కోట్లు


‣ బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు

‣ ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు


బిహార్‌కు ఆర్థిక సాయం


‣ బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం

‣ బిహార్‌లో జాతీయ రహదారులకు రూ.20వేల కోట్లు 


విద్యార్థులకు రూ.10లక్షల రుణం
 

‣ దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10లక్షల వరకు రుణాలు


అమరావతికి రూ.15వేల కోట్ల ప్రత్యేక సాయం


‣ ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

‣ ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం

‣ అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు

‣  పోలవరానికి పెద్దపీట.. త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి

‣  రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు

‣  విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు


 మొబైల్‌ ఫోన్లపై సుంకం తగ్గింపు..
 

‣ మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ పీసీడీఏ, మొబైల్‌ ఛార్జర్లపై విధించే బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు


స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంపు
 

‣ స్టాండర్డ్‌ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు


కొత్త పన్ను విధానంలో మార్పులు


‣ కొత్త పన్ను విధానంలో మార్పులు చేసిన ఆర్థిక మంత్రి

‣ సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా

‣ రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను

‣ రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను

‣ రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను

‣ రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను 

‣ రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను

‣  కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా


క్యాపిటల్‌ గెయిన్స్‌ విధానం సరళీకరణ
 

‣ లాంగ్‌ టర్మ్‌ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను

‣ క్యాపిటల్‌ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు

 స్టార్టప్‌లకు ప్రోత్సాహకం.. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు



  ♦ Union Budget 2024-25  


 ♦ Highlights  


 ♦ Click Here For More Details  

Posted Date: 23-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని