ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కళాశాలల్లో న్యాయ విద్య సీట్ల భర్తీకి ఆగస్టు 5వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య లింబాద్రి అధ్యక్షతన ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన.. 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 27న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో అసలు ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. కౌన్సెలింగ్కు సంబంధించి పూర్తి వివరాలను జులై 24న వెబ్సైట్లో ఉంచనున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.