* ఈసీని కోరిన ఇంటర్ విద్యామండలి
ఈనాడు, అమరావతి: ఇంటర్ ఫలితాల విడుదలకు ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ఇంటర్మీడియట్ విద్యామండలి లేఖ రాసింది. ఏప్రిల్ 12న ఫలితాలు విడుదల చేస్తామని అందులో పేర్కొంది. ఇందుకు ఈసీ నుంచి ఏప్రిల్ 11న అనుమతి వస్తే.. 12న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 9,99,698 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 75 మందిపై మాల్ప్రాక్టీస్ కింద కేసులు నమోదయ్యాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.