* పరీక్ష నిర్వహణపై స్పష్టత కరవు
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీలో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ నుంచి స్పష్టత రాలేదు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కూడా ఏవిధమైన ప్రకటన చేయలేదు. దీంతో అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షల మంది అభ్యర్థుల పట్ల అధికారుల వైఖరి తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఇప్పటి వరకు పరీక్ష కేంద్రాల ఎంపిక ప్రక్రియ మొదలు కాలేదు. అలాగే టెట్ ఫలితాలు వెలువడలేదు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.