* బీబీఏ కోర్సులను బీకాంలో పెట్టాలంటూ ఆదేశాలు
AP: రాష్ట్రంలో ఉన్నత విద్యను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పేద విద్యార్థులకు బీబీఏ కోర్సులు లేకుండా చేసేందుకు సిద్ధమైంది. వాటిని రద్దు చేయాలని సూచించింది. దేశంలో బీబీఏ, . ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో 24 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇవి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) పరిధిలో ఉండగా ఇటీవల ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిని నిర్వహిస్తున్న కళాశాలలు.. కోర్సుకు రూ.20వేల చొప్పున చెల్లించాలని ఏఐసీటీఈ సూచిస్తూ భవిష్యత్తులో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ నిధులు చెల్లించేందుకు ఇష్టపడని కళాశాల విద్యాశాఖ.. ఆ కోర్సులను మూసివేయాలంటూ కళాశాలలను ఆదేశించింది. ప్రస్తుతం ఈ కోర్సులు చేస్తున్న విద్యార్థుల చదువు పూర్తయిన అనంతరం పొడిగించొద్దని సూచించింది. బీబీఏ కోర్సులను మూసేసి వీటి స్థానంలో బీకాం లాజిస్టిక్స్, మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని కళాశాల విద్యాశాఖ ఆదేశించింది. అనంతపురంలోని డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది కొత్తగా బిజినెస్ డేటా అనలిటిక్స్ ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదన పంపించగా.. కమిషనరేట్ వద్దని తిరస్కరించింది. బీకాంలోనే పెట్టుకోవాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.