* ఏప్రిల్ 20న ర్యాంకుల వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్ చివరి విడత పేపర్-1 పరీక్షలు ఏప్రిల్ 9తో ముగిశాయి. సుమారు 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 95 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) మరో నాలుగైదు రోజుల్లో ప్రాథమిక ‘కీ’ విడుదల చేయనుంది. తొలి, తుది విడత పరీక్షల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్ 20న ర్యాంకులను ప్రకటిస్తుంది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి ప్రశ్నపత్రాలు కొంత సులువుగా ఉన్నాయని జేఈఈ నిపుణుడు కృష్ణ చైతన్య అభిప్రాయపడ్డారు. మరోవైపు బీఆర్క్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పేపర్-2 పరీక్ష ఏప్రిల్ 12న జరగనుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వృత్తి విద్యా శిక్షణ ఉంటే కొలువులు ఇవిగో!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.