* ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో జులై 28వ తేదీన జరగాల్సిన గ్రూప్-2 ప్రధాన పరీక్ష (Mains) వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ (APPSC) ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే మెయిన్స్ తేదీలను వెల్లడిస్తామని కమిషన్ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించగా, ఏప్రిల్ 10న ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్కు రాష్ట్ర వ్యాప్తంగా 4,04,037 మంది హాజరయ్యారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రకటన వివరాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.