ఈనాడు డిజిటల్, అమరావతి: కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటైన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ వర్సిటీలో పీజీ ప్రవేశాలు జరుగుతున్నాయని, ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ డైరెక్టర్ రమేష్ తెలిపారు. జులై 2న ఆయన విజయవాడలోని వర్సిటీలో విలేకర్లతో మాట్లాడారు. ‘ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విభాగాలకు సంబంధించిన తొమ్మిది కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఒక్కో దాంట్లో 25 సీట్ల చొప్పున మొత్తం 225 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది వరకే ప్రకటన వెలువడింది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి’ అని సూచించారు. ఏపీ విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, అకడమిక్ డీన్ అయాన్కుమార్ పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.