• facebook
  • whatsapp
  • telegram

DSC Book Fund: డీఎస్సీ అభ్యర్థులకు బుక్‌ ఫండ్‌

* 10 వేల మందికి నగదు అందజేత

* ఏప్రిల్ 5 దరఖాస్తుకు గడువు

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణలో డీఎస్సీ సన్నద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు శుభవార్త. ఉపాధ్యాయ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ అధ్వర్యంలో బుక్‌ ఫండ్‌, స్టడీ మెటీరియల్‌ ఖర్చును అందించనున్నారు. 7వేల మంది ఎస్జీటీ అభ్యర్థులకు, 3 వేల మంది స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.1500 చొప్పున బుక్‌ ఫండ్‌, స్టడీ మెటీరియల్‌ ఖర్చును అందిస్తారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షలు మించని అభ్యర్థులు అర్హులు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు 040 24071178, 27077929 నంబర్లలో సంప్రదించాలి.



ప్రకటన వివరాలు 


ఆన్‌లైన్‌ అప్లికేషన్‌


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.