* ఒకే రోజు పోలింగ్, పరీక్ష
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తేదీ వెల్లడైన నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET 2024)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్కు సంబంధించి ఈసీ షెడ్యూలు ప్రకటించింది. ఈ మేరకు మే 27న పోలింగ్ జరగనుంది. మే 20 నుంచి జూన్ 3 వరకు ఆన్లైన్ ఆధారిత టెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెట్పై పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రభావం ఉండనుంది. ఎన్నికల రోజు సంబంధిత జిల్లాల్లో సాధారణంగా సెలవు ఉంటుంది. టెట్ అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు కావడంతో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ స్పష్టత నివ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.