* దరఖాస్తుకు నేడే చివరి తేదీ..
అమరావతి: ఏపీలో పెద్ద సంఖ్యలో టీచింగ్ పోస్టుల (Teaching Jobs) భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. పాఠశాల విద్యాశాఖలోని సమగ్రశిక్షా సొసైటీ నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 1358 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన (కాంట్రాక్ట్) భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఇటీవల ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు జూన్ 5లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యాంశాలివే..
మొత్తం ఖాళీలివే: ప్రిన్సిపాల్ 92 పోస్టులు ఉండగా.. పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ 846; సీఆర్టీ 374, పీఈటీ 46 చొప్పున పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు: ఆయా ఉద్యోగాలను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీలలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: జనరల్ అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున వయో సడలింపు ఉంటుంది.
గౌరవ వేతనం: ప్రిన్సిపాళ్లకు రూ.34,139; సీఆర్టీలకు రూ.26,759; పీజీటీలకు రూ.26,759; పీఈటీలకు రూ.26,759 చొప్పున నెలకు గౌరవ వేతనం లభిస్తుంది.
దరఖాస్తు రుసుము: రూ.100. కేవలం ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.