* వాట్సాప్ ద్వారా సమాధానాలు
హైదరాబాద్: ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం(జూన్ 5) నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడినట్టు గుర్తించారు. సికింద్రాబాద్ మార్కెట్, నాచారం, ఎల్బీనగర్, మల్కాజ్గిరి పీఎస్లలో మాస్ కాపీయింగ్పై కేసులు నమోదయ్యాయి. సికింద్రాబాద్ ఎస్వీఐటీ, నాచారం, ఎల్బీనగర్, మల్కాజ్గిరిలోని అయాన్ డిజిటల్ సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగినట్టు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఐదుగురు విద్యార్థులు వాట్సాప్ ద్వారా సమాధానాలు చేరవేసుకున్నారు. నాచారం అయాన్ డిజిటల్ సెంటర్లో ఓ విద్యార్థి వద్ద మొబైల్ గుర్తించిన ఇన్విజిలేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఐదుగురు విద్యార్థులతో కలిసి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్టు తేలింది. వెంటనే మిగతా విద్యార్థులు ఉన్న సెంటర్లను పోలీసులు అప్రమత్తం చేశారు. ఐదుగురు విద్యార్థులను పరీక్షా కేంద్రాల నుంచి పోలీసులు బయటకు తీసుకొచ్చారు. ఐదుగురు ఇంటర్ విద్యార్థులకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించారు. ఆన్లైన్ విధానంలో జరిపిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది హాజరైవుంటారని అంచనా. ఈసారి కటాఫ్ మార్కులు సుమారు 60గా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.