ఈనాడు, దిల్లీ, హైదరాబాద్: ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) పరీక్షను 2023 నుంచి యూపీఎస్సీ ద్వారా నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ డిసెంబరు 2న ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్ (30), మెకానికల్ (30), ఎలక్ట్రికల్ (60), కామర్స్ అండ్ అకౌంటెన్సీ (30) విభాగాలకు చెందిన మొత్తం 150 పోస్టులకు ఐఆర్ఎంఎస్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే యూపీఎస్సీని కోరినట్లు పేర్కొంది. ఈ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ పద్ధతిలో రెండంచెల్లో ఉంటుంది. మెయిన్ పరీక్ష 4 పేపర్లుగా (వ్యాస విధానం) రాయాలి. క్వాలిఫైయింగ్ పేపర్స్ కింద పేపర్-ఎ భారతీయ భాషలు, పేపర్-బి ఇంగ్లిష్లో 300 మార్కుల చొప్పున ఉంటాయి. మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకొనే అప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1, పేపర్-2 ఒక్కోటి 250 మార్కులకు ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీల్లో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ను అభ్యర్థులు ఎంచుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షల తరహాలోనే వీటికి సిలబస్, ఆప్షనల్ సబ్జెక్టులు ఉంటాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.