దిల్లీ: ఐఐటీ మద్రాస్ విద్యార్థులు 25 మంది రూ.కోటి పైనే వార్షిక వేతన ఆఫర్లు పొంది ఔరా అనిపించారు. టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, క్వాల్కం, జేపీ మోర్గన్, మోర్గన్ స్టాన్లీ, మెకిన్సే వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు బజాజ్ ఆటో వంటి దేశీయ కంపెనీలూ ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు పట్టం కట్టాయి. ఐఐటీ గువాహటిలో ప్లేస్మెంట్లు ప్రారంభమైన డిసెంబరు 2న 84 కంపెనీలు 290 మంది విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చాయి. ఇద్దరికి అంతర్జాతీయ ఆఫర్లు, అయిదుగురికి కోటి రూపాయలకు మించిన వార్షిక వేతన ప్రతిపాదనలు అందాయి. ఐఐటీ రూర్కీలో ఇద్దరు విద్యార్థులు కోటి రూపాయల ఆఫర్లు పొందారు. 10 మంది రూ.80 లక్షల ఆఫర్లు పొందారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.