• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 18-04-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  రత్నగిరి-సింధుదుర్గ్‌ భాజపా అభ్యర్థిగా నారాయణ్‌ రాణె
కేంద్రమంత్రి నారాయణ్‌ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న శివసేన (యూబీటీ) అభ్యర్థి వినాయక్‌ రౌత్‌ ఇక్కడ ఆయనకు ప్రత్యర్థి. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


2.  స్వదేశీ క్రూజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్‌ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) ఇందుకు వేదికైంది. తాజా పరీక్షలో క్షిపణికి సంబంధించిన అన్ని ఉపవ్యవస్థలు నిర్దేశిత రీతిలోనే పనిచేశాయని అధికారులు పేర్కొన్నారు. 
  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


3.  దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్‌ రాజధాని దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. సింగపూర్‌కు చెందిన ఛాంగి రెండోస్థానంలో ఉంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4.  హిమాచల్‌ మారుమూల గ్రామానికి తొలిసారి మొబైల్‌ సౌకర్యం
హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్‌లో ముచ్చటించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


5.  తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్‌ తుర్కియేలో మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్‌ ప్రావిన్స్‌లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.