* పరీక్ష రాయనున్న విద్యార్థులు 7,864 మంది
కరెన్సీనగర్, న్యూస్టుడే: ఎన్టీఆర్ జిల్లాలో ఏప్రిల్ 27న ‘పాలీసెట్-2024’ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో రెండు ప్రభుత్వ, 13 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ ట్రేడుల్లో 3,920 సీట్లున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 కేంద్రాల్లో ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు చేశామని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.విజయసారథి తెలిపారు. విజయవాడలో 11 కేంద్రాల్లో 4,888 మంది, తిరువూరు 4 కేంద్రాల్లో 1,416, నందిగామ 5 కేంద్రాల్లో 1,560 మంది కలిపి మొత్తం 7,864 మంది పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులను ఉదయం 10గంటలకు కేంద్రాల లోపలకు అనుమతిస్తారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతీయబోమని పేర్కొన్నారు. ఇప్పటికే పరిశీలకులను నియమించామని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.