• facebook
  • whatsapp
  • telegram

Schools: 1న ‘మన ఊరు- మన బడి’ పాఠశాలలు ప్రారంభం 

 

ఈనాడు, హైదరాబాద్‌: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1200 పైచిలుకు పాఠశాలల్లో పనులన్నీ పూర్తయ్యాయని పేర్కొన్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్తు ఛైర్మన్లతో సమన్వయం చేసుకొని ఫిబ్రవరి 1న వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఆ రోజు గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించాలని సూచించారు. ఏదైనా నియోజకవర్గంలో ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఉంటే కొన్నిటిని తర్వాత రోజుల్లో ప్రారంభించుకోవచ్చని తెలిపారు. మొదటి విడతలో 9,123 బడులను రూ.3,497.62 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని పేర్కొన్నారు.

 

684 బడులే ప్రారంభం!

ఫిబ్రవరి 1న మొత్తం 684 పాఠశాలలనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ జాబితాలను  జిల్లాలకు పంపారు. ఇందులో హైదరాబాద్‌ జిల్లాలో ఆరు, వరంగల్‌ జిల్లాలో ఎనిమిది పాఠశాలలే ఉన్నాయి. ఈ 684లో ఉన్నత పాఠశాలలు 40లోపే ఉండగా.. ప్రాథమిక పాఠశాలలు 90 శాతం ఉన్నాయి.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.