* 6 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్లో ప్రవేశించేందుకు ఎప్సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం (జులై 03) నుంచి ప్రారంభం కానుంది. 4 నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎప్పుడు హాజరవుతారో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 హెల్ప్లైన్ కేంద్రాల్లో ఏదో ఒకచోట ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. పరిశీలన చేయించుకున్న వారు ఈ నెల 8 నుంచి 15 వరకు వారికి నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వారికి ఈ నెల 19వ తేదీ లేదా ఆ లోపు తొలి విడత సీట్లు కేటాయిస్తామని ఎప్సెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
ఎప్సెట్ వెబ్సైట్లోనే ప్రవేశాల లింక్
గతేడాది వరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఒక వెబ్సైట్, ప్రవేశాల కౌన్సెలింగ్కు మరో వెబ్సైట్ ఉండేది. దాంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యేవారు. ఈ సారి ఎప్సెట్ వెబ్సైట్ (www.eapcet.tsche.ac.in) లోకి వెళ్లినా అక్కడ అడ్మిషన్పై క్లిక్ చేస్తే కౌన్సెలింగ్ వెబ్సైట్ (www.tseapcet.nic.in)లోకి వెళ్లొచ్చు.
ఇంకా జీవోలు రాలేదు..
ఈ సారి మల్లారెడ్డి గ్రూపులోని ఒక కళాశాలను మరో కళాశాలలో విలీనం చేశారు. బాచుపల్లిలోని గోకరాజు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం కింద ఉన్న లీలావతి మహిళా ఇంజినీరింగ్ కళాశాలను కో-ఎడ్యుకేషన్గా మార్చేందుకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. ఈ రెండు మార్పులపై విద్యాశాఖ బుధవారం రాత్రి వరకు జీవోలు జారీ చేయలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క కళాశాలకు కూడా ఇంకా అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఈ సారి కూడా ఆనవాయితీగా చివరి నిమిషంలోనే కళాశాలలకు అనుమతులివ్వడంతోపాటు సీట్ల సంఖ్య వెల్లడించాల్సిన పరిస్థితి.
Telangana Mock Counseling 2024
♦ Engineering
♦ Agriculture and Medical
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.