* అదనంగా మరో 141 పోస్టులు చేర్చిన టీఎస్పీఎస్సీ
* ప్రకటనలో 8,180కి చేరిన మొత్తం ఉద్యోగాలు
గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనలో మరో 141 పోస్టులను అదనంగా టీఎస్పీఎస్సీ చేర్చింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో గ్రూప్-4 సర్వీసుల పరిధిలోకి వచ్చే 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం జనవరి 27న అనుమతి మంజూరు చేసింది. దీంతో బీసీ గురుకుల సొసైటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనలో ఇపుడున్న 8039 పోస్టులకు అదనంగా 141 ఉద్యోగాలు చేర్చుతూ టీఎస్పీఎస్సీ ఉద్యోగ ప్రకటన 19/2022కు అనుబంధాన్ని జారీ చేసింది. ఈ పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-4లో మొత్తం పోస్టుల సంఖ్య 8,180కి చేరింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో బాలుర విద్యాలయాల్లో 86 పోస్టులు, బాలికల విద్యాలయాల్లో 55 పోస్టులు ఉన్నాయి. గురుకుల బాలికల విద్యాలయాల్లోని పోస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ పోస్టులకు డిగ్రీ కనీస అర్హతగా అనుబంధంలో పేర్కొంది. ఇప్పటికే గ్రూప్-4 కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు కూడా దరఖాస్తు చేసినట్లు పరిగణిస్తామని కమిషన్ వెల్లడించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.