* 28వ తేదీన పరీక్ష
* 30 సబ్జెక్టుల్లో పరీక్ష
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్)-2024 అడ్మిట్కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈమెయిల్ ఐడీ/ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 28న ప్రధాన కేంద్రాల్లో జరుగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు ఆంధ్ర విశ్వవిద్యాలయం సమాయత్తమవుతోంది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్ నిర్వహిస్తోంది. జనరల్ స్టడీస్, 30 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
ఏపీ సెట్ 2024 అడ్మిట్కార్డుల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.