• facebook
  • whatsapp
  • telegram

TS TET 2024: ఎమ్మెల్సీ ఎన్నిక.. ఆందోళనలో టెట్‌ అభ్యర్థులు

* ఒకే రోజు పోలింగ్‌, పరీక్ష
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తేదీ వెల్లడైన నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET 2024)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌కు సంబంధించి ఈసీ షెడ్యూలు ప్రకటించింది. ఈ మేరకు మే 27న పోలింగ్‌ జరగనుంది. మే 20 నుంచి జూన్‌ 3 వరకు ఆన్‌లైన్‌ ఆధారిత టెట్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెట్‌పై పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ ప్రభావం ఉండనుంది. ఎన్నికల రోజు సంబంధిత జిల్లాల్లో సాధారణంగా సెలవు ఉంటుంది. టెట్‌ అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు కావడంతో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ స్పష్టత నివ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.