* జులై 8- 10 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన
* 1500 మంది విద్యార్థులకు ప్రవేశం
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ట్రిపుల్ ఐటీ క్యాంపస్(బాసర)లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి మొత్తం 1500 సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాలను జులై 8, 9, 10 తేదీల్లో పరిశీలిస్తారు. స్పెషల్ కేటగిరీ ధ్రవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా ఇప్పటికే విడుదలైంది. వీరికి జులై 4, 5వ తేదీల్లో బాసర క్యాంపస్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్పోర్ట్స్, పీహెచ్ అభ్యర్థులకు జులై 4న; క్యాప్, ఎన్సీసీ కేటగిరీ అభ్యర్థులకు జులై 5న సంబంధిత ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది.
బోధన రుసుముల వివరాలు
ఎంపికైన విద్యార్థులు ఏటా రూ.30 వేలు విద్యాలయానికి చెల్లించాలి. అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే బోధన రుసుం విద్యాలయానికి చెల్లిస్తుంది. రిజిస్ట్రేషన్ రుసుము కింద జనరల్, బీసీ విద్యార్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. కాషన్ డిపాజిట్ కింద ప్రతి విద్యార్థి రూ.2000 చెల్లించాలి. దీన్ని విద్యార్థి విద్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయేటప్పుడు తిరిగి అందజేస్తారు. ఎన్ఆర్ఐ విద్యార్థులు ఏటా రూ.3,01,000, ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఏటా రూ.1.36 లక్షలను బోధన రుసుముగా చెల్లించాలి. గ్లోబల్ కోటాలో ఏటా రూ.1.36 లక్షలు చెల్లించి స్థానికులు ఎవరైనా సీటు పొందొచ్చు.
విద్యా విధానం
ఆరేళ్ల సమీకృత విద్యావిధానం ఆధారంగా ఆర్జీయూకేటీలో బోధన సాగుతుంది. మొదట రెండేళ్ల ఇంటర్ తత్సమాన కోర్సు పీయూసీ ఉంటుంది. రెండేళ్ల పీయూసీ విద్య అభ్యసించిన అనంతరం ఎవరికైనా మెరుగైన విద్యావకాశాలు వస్తే ఆర్జీయూకేటీ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. నాలుగేళ్ల బీటెక్ కోర్సు సెమిస్టర్ విధానంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్జీయూకేటీ బీటెక్లో సివిల్, కెమికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులను అందిస్తోంది. పీయూసీ అనంతరం విద్యార్థి తన గ్రూపును ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు పీయూసీలో సాధించిన మార్కులు ఆధారంగా తీసుకుంటారు.
ట్రిపుల్ఐటీ ఎంపిక జాబితా కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.