• facebook
  • whatsapp
  • telegram

APPSC: వివిధ నియామక పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన   

* తేదీల‌ను వెల్లడించిన ఏపీపీఎస్సీ

ఈనాడు, అమరావతి: వివిధ ఉద్యోగ నియామకాలకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించారు. జులై 23 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయుర్వేద మెడికల్‌ ఆఫీసర్లుగా ఎంపికయిన వారికి ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. హోమియో మెడికల్‌ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికయిన వారికీ అవే తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ల ఉద్యోగాలకు ఎంపికచేసిన వారి జాబితానూ ఏపీపీఎస్సీ ప్రకటించింది. శాంపిల్‌ టేకర్‌ (పుడ్‌ డిపార్టుమెంట్‌-వైద్య ఆరోగ్యశాఖ) ఉద్యోగ నియామకాలకు ప్రాథమికంగా ఎంపికచేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన 12న ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరుగుతుందని కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్స్‌ ఉద్యోగాల నియామకాలకు ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.


 

మరింత సమాచారం... మీ కోసం!       

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.