* 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ
సత్తెనపల్లి, న్యూస్టుడే: అధునాతన విద్యాబోధనకు చిరునామాగా ఉన్న కేంద్రియ విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళయ్యింది. 2024-25 విద్యా సంవత్సరానికి కేవీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఒకటో తరగతిలో పిల్లల్ని చేర్చితే ఇంటర్ వరకు అభ్యసనకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు సమీపంలోని నల్లపాడు, తెనాలి, సత్తెనపల్లి, బాపట్ల సమీపంలోని సూర్యలంక, నాదెండ్ల మండలం ఇర్లపాడులో విద్యాలయాలు ఉన్నాయి. కొత్తగా ఈ విద్యా సంవత్సరంలో పల్నాడు జిల్లాలో నరసరావుపేట, మాచర్లలో కేవీలు ప్రారంభించే ప్రతిపాదన ఉంది.
దరఖాస్తు గడువు ఇలా: ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి అదే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తునకు అవకాశం ఉంది. తొలి ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. సీట్ల ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితా మే 8న విడుదల చేస్తారు. రెండు, ఆ పై తరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెండో తరగతికి ఎంపికైన వారి జాబితా ఏప్రిల్ 15న విడుదల చేస్తారు. 11వ తరగతి మినహా మిగిలిన తరగతులన్నింటిలోనూ ప్రవేశాలను జూన్ 29లోపు పూర్తి చేస్తారు. https://kvsangathan.nic.in/ వెబ్సైట్తోపాటు కేవీఎస్ రూపొందించిన ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్మీడియట్తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.