* పాలిసెట్-2024 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలిటెక్నిక్లు, వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాలిటెక్నిక్లలో రెండేళ్ల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులు, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 10 నుంచి 12 వరకు రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ జరగనుంది. పాలిసెట్-2024 ర్యాంకులు పొందిన అభ్యర్థులను మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని రిజిస్ట్రార్ పి.రఘురామిరెడ్డి తెలిపారు. అభ్యర్థులు షెడ్యూల్ మేరకు వారి ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. దీనికి సంబంధించి షెడ్యూల్, అభ్యర్థులు తేవాల్సిన ధ్రువీకరణపత్రాలు, రుసుం తదితర వివరాలు వర్సిటీ వెబ్సైట్ www.pjtsau.edu.in లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.