* 18న అతిథి అధ్యాపకులకు మౌఖిక పరీక్షలు
![]() |
విజయనగరం మయూరి కూడలి, న్యూస్టుడే: విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉన్న 13 డా.బి.ఆర్. అంబేడ్కర్ గురుకులం విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పని చేయడానికి అర్హులైన వారికి నేరుగా ఈ నెల 18న నెల్లిమర్ల గురుకులంలో డెమో-కం- మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకులం ఉమ్మడి జిల్లాల సమన్వయాధికారిణి టి.ఎం.ఫ్లోరెన్స్ పేర్కొన్నారు. తెలుగు, ఫిజికల్ సైన్సు, ఫిజికల్ డైరెక్టర్, ఆంగ్లం, గణితం, జువాలజీ, హిందీ, ఎకనమిక్స్తో పాటు స్టాఫ్నర్స్ వంటి కొలువులకు ఈ మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా కొలువులకు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఎడ్, టెట్ అర్హత ఉండాలన్నారు. స్టాఫ్నర్స్ కొలువుకు జీఎన్ఎం, పీడీ పోస్టుకు బీపీఈడీతో పాటు ఏదైనా పీజీ, ఎంపీఈడీ అర్హతలు ఉండాలని చెప్పారు. అభ్యర్థులు ఆ రోజు నేరుగా కేంద్రానికి ఉదయం 9.30 గంటలకు విద్యార్హత పత్రాలతో హాజరవ్వాలని కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.