నాబార్డు ఛైర్మన్ జీఆర్ చింతల

ఈనాడు, అమరావతి, న్యూస్టుడే-పొన్నూరు: యువత వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తయారై.. దేశంలో వ్యవసాయ పునర్నిర్మాణానికి కృషి చేయాలని నాబార్డు ఛైర్మన్ జీఆర్ చింతల పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత పెరిగేకొద్దీ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సూచించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ వర్సిటీ 9వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపక ఛైర్మన్, ఎంపీ అచ్యుత్ సమంత, లారస్ ల్యాబ్స్ సీఈఓ చావా సత్యనారాయణలకు వర్సిటీ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చింతల మాట్లాడుతూ.. భారత్లో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ 11 కోట్ల మందికి ఉపాధి చూపిన ఏకైక రంగం వ్యవసాయమేనని చెప్పారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ.. సమాజ హితమే యువతకు లక్ష్యం కావాలని సూచించారు. 1,821 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, 52 మందికి బంగారు పతకాలు అందజేశారు. ఐసీసీఆర్ ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు వినయ్ సహస్రబుద్ధే, వర్సిటీ వైస్ఛైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కులపతి కె.రామ్మూర్తినాయుడు, ఉపకులపతి ఎం.వై.ఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.