ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులకు హాజరు ఆధారిత డిటెన్షన్ విధానం నుంచి మినహాయింపు ఇస్తూ జేఎన్టీయూ నిర్ణయించింది. ఇది ప్రస్తుత సెమిస్టర్కు వర్తిస్తుందని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ మే 31న ఆదేశాలు జారీ చేశారు. జులైలో జరిగే బీటెక్, ఎంటెక్ సెమిస్టర్ పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షలకు కనీస హాజరుతో సంబంధం లేకుండా విద్యార్థులు రాసే వీలుంటుంది. కరోనా మహమ్మారి సమయంలో అనుసరించిన పరీక్ష విధానమే అమల్లో ఉంటుంది. ఎక్కువ ఛాయిస్ ఇస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.