ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: 2022-23 విద్యా సంవత్సరానికి ఆల్ ఇండియా కోటా పీజీ మెడికల్ సీట్ల ప్రవేశానికి సంబంధించి తాత్కాలిక ప్రవేశాల షెడ్యూల్ను కేంద్రం విడుదల చేసింది. దీనిలో భాగంగా ఆగస్టు 30, 31 తేదీల్లో దేశంలోని అన్ని వైద్య విశ్వవిద్యాలయాలు సీట్ మ్యాట్రిక్స్ను విడుదల చేయాల్సి ఉంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు తమ పేర్లను నమోదు, ప్రవేశాల రుసుము చెల్లించాలి. రెండో తేదీ నుంచి 5వ తేదీ వరకు కళాశాల ఆప్షన్లు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. సీట్ల ప్రవేశాలను 6, 7 తేదీల్లో అంచనావేసి 8వ తేదీ కేటాయింపులు ప్రకటిస్తారు. సీట్లు వచ్చిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో 9వ తేదీ నుంచి 13వ తేదీలోగా చేరాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబరు 17వ తేదీ నుంచి అక్టోబరు ఒకటో తేదీ వరకు చేపడతారు. చివరిగా మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ అక్టోబరు 4వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనుంది. చివరిగా మిగిలిన సీట్లను అక్టోబరు 31వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!
‣ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో టాప్ డిగ్రీ కళాశాలలు
‣ కోరుకున్న కోర్సులకు ఇదుగో ఇగ్నో!
‣ సరైన నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూత్రాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.