ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30,625 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) నిర్ణయించింది. సెప్టెంబర్ 24న నిర్వహించిన న్యాక్ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు న్యాక్ తెలిపింది. రాష్ట్రం నుంచి మధ్యప్రాచ్య దేశాలకు పెద్దసంఖ్యలో నిరుద్యోగులు వలస వెళ్తున్న నేపథ్యంలో 9 జిల్లాల్లో దశలవారీగా శిక్షణ కేంద్రాలను నిర్మిస్తారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నియామకాల్లో ఎంపికైన ఇంజినీర్లకు 30 రోజులపాటు వృత్తిపరమైన శిక్షణ ఇస్తారు. దళితబంధు పథకం ద్వారా జేసీబీలు పొందినవారికి వాటి నిర్వహణపై శిక్షణ ఇస్తారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యాక్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెండు దఫాలుగా వేతనాన్ని 30 శాతం పెంచుతారు. 2021 జనవరి నుంచి 20 శాతం, ఈ ఏడాది ఆగస్టు నుంచి 10 శాతం వేతనం పెంపును సమావేశం ఆమోదించింది. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.