* టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: జూనియర్ లెక్చరర్(జేఎల్) నియామకాల్లో భాగంగా సెప్టెంబరులో నిర్వహించిన ఇంగ్లిష్ పేపర్-2లో 37 ప్రశ్నలపై అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలంటూ టీఎస్పీఎస్సీకి అక్టోబరు 30న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నలపై అభ్యంతరాలను టీఎస్పీఎస్సీ పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ టి.ప్రణీత్రెడ్డి మరో అయిదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి.మాధవీదేవి అక్టోబరు 30న విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బూర రమేశ్ వాదనలు వినిపిస్తూ పోస్టుల భర్తీలో భాగంగా సెప్టెంబరు 12న రాత పరీక్ష నిర్వహించారన్నారు. పేపర్-1 (జనరల్ స్టడీస్), పేపర్-2 (ఇంగ్లిష్) నిర్వహించారన్నారు. టీఎస్పీఎస్సీ సెప్టెంబరు 22న విడుదల చేసిన ప్రాథమిక కీని పరిశీలిస్తే ఇంగ్లిష్ పేపరులో పలు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయన్నారు. దీనిపై వెబ్సైట్లో పిటిషనర్లు అభ్యంతరాలను వ్యక్తం చేయగా టీఎస్పీఎస్సీ పట్టించుకోకుండా తుది కీ విడుదల చేసిందన్నారు. పరీక్షను రద్దుచేసి తాజాగా నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. పిటిషనర్ల ఆరోపణలపై వివరణ ఇవ్వడానికి గడువు కావాలని టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్రావు అభ్యర్థించడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను నవంబరు 3కు వాయిదా వేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.