ఈనాడు, హైదరాబాద్: విదేశాల్లో క్యాంపస్లు ప్రారంభించేందుకు జేఎన్టీయూ సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో విశ్వవిద్యాలయ క్యాంపస్లు ఆరంభించనున్నారు. అందుకు ఆయా దేశాల్లో పూర్వ విద్యార్థులు సహకరించనున్నారు. వీటిపై చర్చించేందుకు వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ నవంబరు 2న అమెరికా వెళ్లారు. పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు డాక్టర్ హరి ఇప్పనపల్లి వీరికి సహకరిస్తున్నారు. క్యాంపస్ల ఏర్పాటుకు స్థానిక రాష్ట్రాలు అనుమతులు జారీ చేసిన వెంటనే ప్రారంభిస్తారు. మరోవైపు డ్యూయల్ డిగ్రీ కోర్సు ఒప్పందాల్లో భాగంగా లాస్వేగాస్, న్యూయార్క్, న్యూజెర్సీ, డెట్రాయిట్, అలబామాలోని విదేశీ వర్సిటీల అధికారులను కలుసుకోనున్నారు. ఐదేళ్ల ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో మూడేళ్లు హైదరాబాద్లో, నాలుగో సంవత్సరం అమెరికాలో, ఐదో సంవత్సరం ఎంఎస్ చదవాలని అధికారులు తెలిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారు జేఎన్టీయూ క్యాంపస్లలో తమ పిల్లలను చేర్పించే అవకాశాలున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.