• facebook
  • whatsapp
  • telegram

Apprentice fair: 14న అప్రెంటీస్‌ మేళా

కరెన్సీనగర్, న్యూస్‌టుడే:  నవంబరు 14న నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రధాన మంత్రి నేషనల్‌ అప్రెంటీస్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్‌ ఎం.కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలో ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరై అర్హత కలిగిన విద్యార్థులను పరిశ్రమల్లో అప్రెంటీస్‌ సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో అన్ని ట్రేడ్‌లకు శిక్షణ తీసుకొని ధ్రువపత్రాలు పొందిన విద్యార్థులు ఈ మేళాకు ఒరిజనల్, జెరాక్స్‌ ధ్రువ పత్రాలు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 0866-2475575, 83094-42698, 77804-29468 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. 

మరింత సమాచారం... మీ కోసం

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.