కరెన్సీనగర్, న్యూస్టుడే: నవంబరు 14న నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ ఎం.కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. మేళాలో ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరై అర్హత కలిగిన విద్యార్థులను పరిశ్రమల్లో అప్రెంటీస్ సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో అన్ని ట్రేడ్లకు శిక్షణ తీసుకొని ధ్రువపత్రాలు పొందిన విద్యార్థులు ఈ మేళాకు ఒరిజనల్, జెరాక్స్ ధ్రువ పత్రాలు, పాస్పోర్టు సైజ్ ఫొటోతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 0866-2475575, 83094-42698, 77804-29468 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం
‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ రిమోట్ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.