ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అయిదు విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జి ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడున్న ఉపకులపతుల పదవీకాలం పూర్తి కావడంతో ఇన్ఛార్జులను నియమించింది. ఆంధ్ర వర్సిటీకి రెక్టార్ సమత, శ్రీవేంకటేశ్వరకు విక్రమసింహపురి వర్సిటీ వీసీ సుందరవల్లి, శ్రీకృష్ణదేవరాయకు యోగి వేమన వర్సిటీ వీసీ చింతసుధాకర్, రాయలసీమకు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ వీసీ ఫజుల్ రహ్మన్, ద్రవిడ వర్సిటీకి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ భారతిని ఇన్ఛార్జీలుగా నియమించారు. రెగ్యులర్ ఉపకులపతులను నియమించేందుకు మూడు నెలల ముందు ప్రకటనలు ఇచ్చినా.. ప్రభుత్వం వీసీల పదవీకాలం పూర్తయ్యేలోపు కొత్తవారిని నియమించలేకపోయింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సందేహాలా?.. ఐఐటియన్ల సలహాలివిగో..!
‣ దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు
‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.