* వీసీలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశం
ఈనాడు డిజిటల్, అమరావతి: హైకోర్టు తీర్పు వచ్చేవరకు అధ్యాపక పోస్టుల భర్తీలో దరఖాస్తుల స్వీకరణ తర్వాతి ప్రక్రియ చేపట్టవద్దని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతు(వీసీ)లను ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు ఆదేశించారు. ఈ మేరకు వర్సిటీలకు ఆయన లేఖలు పంపారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ విజయనగరం జేఎన్టీయూలో నియామకాల భర్తీ ప్రక్రియ కొనసాగించడంపై ఆ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలను వీసీలందరు పాటించాలని పేర్కొన్నారు. పలు అధ్యాపక పోస్టులకు నిర్వహించిన హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్ను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. డిసెంబరు 4న విచారణ జరగనుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!
‣ రిమోట్ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.