• facebook
  • whatsapp
  • telegram

Exam Schedule: ఒకే రోజు నాలుగు పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు

* ఇప్పటికే అడ్మిట్‌ కార్డుల జారీ

* డిసెంబర్‌ 17వ తేదీన పరీక్ష 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలకు నిర్వహించే నియామక పరీక్షలు(Recruitment Test) ఒకే తేదీనే ఉండటంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)లో 339 అసిస్టెంట్ ఇంజినీర్(Assistant Engineer), 60 కెమిస్ట్‌ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ఇటీవల ప్రకటన జారీచేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులకు డిసెంబర్‌ 17వ తేదీన రాత పరీక్ష జరగనుంది. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌ జరగనుంది. అలాగే ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో)లో 65 సైంటిస్ట్(Scientist)/ ఇంజినీర్ (ఎస్‌సీ) పోస్టులకు; భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(BEL)లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు డిసెంబర్‌ 17వ తేదీనే పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష హాల్‌టికెట్లు/ అడ్మిట్‌ కార్డులను(Admitcard) ఆయా నియామక సంస్థలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాయి. ఒకటి కంటే ఎక్కువ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటికే ఏ పరీక్ష రాయాలో, ఏ పరీక్షకు సన్నద్ధమవ్వాలో తెలియక తికమకపడుతున్నారు. పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కొందరు అభ్యర్థన చేస్తున్నారు. 
 

సంస్థ/ పోస్టులు  పరీక్ష తేది
తెలంగాణ జెన్‌కోలో 399 అసిస్టెంట్ ఇంజినీర్/ కెమిస్ట్‌  డిసెంబర్‌ 17
ఇస్రోలో 65 సైంటిస్ట్/ ఇంజినీర్  డిసెంబర్‌ 17
బెల్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్  డిసెంబర్‌ 17

ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 10,391 బోధన, బోధనేతర ఖాళీలు 

డిసెంబర్‌ 16, 17, 23, 24

 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.