* విశ్వవిద్యాలయాల్లో చదువులు అంతంతే
ఈనాడు, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు కొరత విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూ సహా నగరంలోని నాలుగు వర్సిటీల్లో పదేళ్లుగా నియామకాలు లేకపోవడంతో విద్యార్థుల చదువు అంతంత మాత్రంగానే ఉంది. జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్లో సరైన సంఖ్యలో ఆచార్యులు లేక ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థుల్లో పదిహేను శాతం మంది రెండు, మూడు సబ్జెక్టుల్లో ఫెయిలవుతున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శాశ్వత ఆచార్యులు ఒక్కరు కూడా లేకపోవడంతో దూరవిద్య పీజీ కోర్సును యూజీసీ రద్దు చేసింది. శాశ్వత ఆచార్యులు లేకపోవడంతో పరిశోధన ప్రాజెక్టులు రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని సంస్థలు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు ప్రాయోజితులు(స్పాన్సర్లు)గా ఉండే పరిశోధన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుతీరనున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్లగా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఆచార్యులు కోరుతున్నారు.
* పదవీ విరమణ చేస్తే అంతే.. రాష్ట్రంలోని వర్సిటీల్లో శాశ్వత పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఆచార్యుల కొరత తీవ్రంగా ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో 891 శాశ్వత ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదవీ విరమణ చేస్తున్న శాశ్వత ఆచార్యుల స్థానంలో అర్హత కలిగిన వారు లేకపోవడంతో ఆయా విభాగాలు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో అసోసియేట్ ప్రొఫెసర్లనే ఇన్ఛార్జులుగా నియమిస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్లో ఉద్యోగాలు
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ డిగ్రీతో ఎయిర్పోర్ట్స్ అథారిటిలో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.