* పెరిగిన ధరలు, ఖర్చులను పరిగణనలోకి తీసుకోండి
* ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్కు హైకోర్టు ఆదేశం
ఈనాడు, అమరావతి: ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల 2023-26 సంవత్సర శ్లాబ్ కాలానికి చట్ట నిబంధనల మేరకు ఫీజులను నిర్ణయించాలని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. కళాశాల యాజమాన్యం చేసిన ఖర్చులు, పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకొని ఫీజులను ఖరారు చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు కళాశాల యాజమాన్యాలు వర్క్షాప్, గార్డెనింగ్ నిర్వహణ విషయంలో నిర్దిష్టంగానే ఖర్చు చేయాలంటూ శ్లాబ్ను విధించొద్దని తేల్చిచెప్పింది. చట్ట నిబంధనలకు భిన్నంగా ప్రైవేటు కళాశాలల ఫీజును ఖరారు చేయడం చూస్తుంటే ఫీజుల రీయింబర్స్మెంట్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై భారం పడకుండా కమిషన్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు డిసెంబరు 5న ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఫీజుల ఖరారుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్, తదితరులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ డిగ్రీతో ఎయిర్పోర్ట్స్ అథారిటిలో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.